Saturday, April 27, 2024

పెందుర్తిలో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసిన గ్రామ వాలంటీర్‌..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బంగారం కోసం వృద్ధురాలు వరలక్ష్మి(72)ని గ్రామ వాలంటీర్‌ హత్య చేసిన ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో జరిగింది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు.

వృద్ధురాలిని హత్య చేసిన అనంతరం ఇంటి నుండి బైటికి వెళ్తున్న గ్రామ వాలంటీర్ వెంకట్ ను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News