- Advertisement -
గుంటూరు: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని సత్తెనపల్లిలో తల్లి, కుమార్తెలు హత్యకు గురైయ్యారు. ఆస్తి కోసం సొంత పెద్దమ్మ, సోదరిని శ్రీనివాస రావు అనే వ్యక్తి కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఇద్దరి మధ్య పొలం వివాదంతోనే నిందితుడు శ్రీనివాస రావు ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Mother and Daughter killed in land dispute in Guntur
- Advertisement -