Thursday, May 9, 2024

విజయనగరంలో మహిళా ఎస్ఐ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Woman SI Suicide in Vizianagaram

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో మహిళా ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంది. ట్రైనింగ్ కోసం వారం రోజుల క్రితం విజయనగరం వెళ్లిన సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్ఐ భవానీ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు అధికారులు కేసు నమోదుచేసుకుని ఆమె ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.ఎస్ఐ భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం. 2018 బ్యాచ్ కు చెందిన భవానీకి రాజోలు స్టేషన్ లో ట్రైనింగ్ తర్వాత సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో మొదట పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ట్రైనింగ్ కోసం విజయనగరం వెళ్లిన ఆమె హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

Woman SI Suicide in Vizianagaram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News