Sunday, May 19, 2024

అడవి, ఎర్రచందనం నేపథ్యంలో…

- Advertisement -
- Advertisement -

Movie on sandalwood thief

 

పర్నిక ఆర్ట్ బ్యానర్‌పై రామ్‌తేజ్, రేఖ ఇందుకూరి హీరోహీరోయిన్లుగా కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో గోపీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘అడవి దొంగ’. ఎర్రచందనం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ట్రైలర్‌ని గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు వీరశంకర్, నిర్మాత ఆరా మస్తాన్‌లు ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ చాలా బాగుందని, ఖచ్చితంగా ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని వారు అన్నారు. దర్శకుడు కిరణ్ కోటప్రోలు మాట్లాడుతూ “అడవి, ఎర్రచందనం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది” అని తెలిపారు. నిర్మాత గోపీకృష్ణ మాట్లాడుతూ.. “థియేటర్లలో ఈ సినిమా చూసే ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. అంత నేచురల్‌గా ఈ సినిమా వచ్చింది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్‌తేజ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News