Friday, April 26, 2024

బాధగా ఉంది.. చెన్నై ఓటమిపై ధోనీ

- Advertisement -
- Advertisement -
MS Dhoni has reacted to Chennai defeat
చెన్నై ఓటమిపై ధోనీ

దుబాయి: 2020 ఐపిఎల్ సీజన్‌లో చెన్నై కథ ముగిసింది. ముంబయితో శుక్రవారం రాత్రి తలపడిన మ్యాచ్‌లో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో ఘోరపరాజయం చవి చూసింది. ఈ సందర్భంగా ఆజట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో తమ జట్టు ప్రదర్శన పట్ల బాధగా ఉందన్నాడు. ఎక్కడ తప్పు జరుగుతోందో తెలుసుకోవలసిన అవసరం ఉందన్నాడు. ఈ ఏడాది తమది కాదని.. ఒకటి, రెండు మ్యాచ్‌లలోనే తాము సమష్టిగా రాణించామన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము పది వికెట్లతో ఓడామా, ఎనిమిది వికెట్లతో ఓడామా అన్నది ప్రధానం కాదని, ప్రతి ఒక్కరూ బాధపడుతున్నా విశ్వప్రయత్నం చేస్తున్నారని తెలిపాడు.

MS Dhoni has reacted to Chennai defeat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News