Saturday, April 27, 2024

భారత జాగృతి “ జయశంకర్ సాహిత్య పురస్కారానికి” డాక్టర్ ఎన్ గోపి ఎంపిక

- Advertisement -
- Advertisement -
అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జూన్ 21న ప్రదానం

హైదరాబాద్ : ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారానికి ఆచార్య ఎన్ గోపి ఎంపికయ్యారు. ఈ నెల జూన్ 21 న అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో జరిగే కార్యక్రమంలో భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇతర పెద్దల చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

సాహిత్యంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సాహితీ మూర్తులకు భారత జాగృతి ఈ అవార్డు ఇవ్వనుంది. అవార్డు ఈ సంవత్సరం మొదలవగా తొలి అవార్డును ఆచార్య ఎన్. గోపి అందుకోనుండడం విశేషం. గోపి ఇప్పటికీ 56 పుస్తకాలు రచించగా అందులో 26 కవితా సంకలనాలు, 7 వ్యాస సంకలనాలు, 5 అనువాదాలు కాగా,  మిగతావి ఇతరాలు ఉన్నాయి. వారి రచనలు అన్ని భారతీయ భాషలలోకి అనువాదం అవడంతో పాటు జర్మన్, పర్షియన్, రష్యన్ వంటి భాషలలోకి అనువాదం అయ్యాయి. వీరు తెలుగు యూనివర్సిటీకి వీసీగా వ్యవహరించడంతో పాటు కాకతీయ, ద్రవిడ యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీ గా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News