Tuesday, May 7, 2024

జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొణిదెల నాగబాబును నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడిగా ఉన్న నాగబాబు సేవలను మరింత విస్తృతంగా ఉపయోగించుకోవాలన్న లక్షంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. దీంతోపాటు విదేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు, అభిమానులను నాగబాబు సమన్వయ పరుస్తారు. ఎన్‌ఆర్‌ఐల సేవలను పార్టీకి సమర్ధవంతంగా ఉపయోగపడేలా కృషి చేయనున్నారు.

జనసేన పార్టీకి గత కొన్నేళ్లనుంచి పరోక్షంగా సేవలు అందిస్తున్న వేమలపాటి అజయ్ కుమార్‌కు పార్టీకి సంబంధించిన ముఖ్యవ్యవహారాల బాధ్యతలను అప్పగించారు. జాతీయ మీడియాకు పార్టీ తరపున అధికార ప్రతినిధిగా సేవలు అందించడంతోపాటు రాజకీయ శిక్షణ తరగతులు , బూత్ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ నిర్వహణ బాధ్యతలను అజయ్ కుమార్ నిర్వహించనున్నారు. కొత్తగా నియామకాలు పొందిన నాగబాబు, అజయ్‌కుమార్‌లకు పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News