Monday, May 13, 2024

దివ్వ తేజస్విని కేసులో కొత్తకోణం

- Advertisement -
- Advertisement -

New angle in Divya Tejaswini case

 

మనతెలంగాణ/హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్ విజయవాడ యువతి దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తులో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు నాగేంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. హత్య ఘటనకు కొద్దిసేపటి ముందు తన స్నేహితుడికి నిందితుడు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని కూడా విచారించిన పోలీసులు ఆసక్తికర విషయాలను తెలుసుకున్నట్టు సమాచారం. దివ్య హత్య జరిగే ముందు తనకు నాగేంద్ర ఫోన్ చేసి కాసేపటిలో దివ్య తేజస్విని ఇంటి దగ్గరకు రావాలని తెలిపినట్లు అతను పోలీసులకు తెలిపాడు. అయితే తాను వచ్చేసరికే గాయపడిన దివ్యను ఆసుపత్రికి తరలించేందుకు కిందకు తీసుకు వస్తున్నారని, లోపలికి వెళ్లి చూస్తే నాగేంద్ర కూడా రక్తపు మడుగులో ఉన్నాడని అతను పోలీసులకు చెప్పాడు.

దీనితో పాటు తేజస్విని ఇంటికి కాస్త దూరంలో నిందితుడు ద్విచక్ర వాహనాన్ని నిలిపి కొంతదూరం నడుచుకుంటూ వెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఈ కేసును దిశ పోలీసు స్టేషన్‌కు తరలించటం వల్ల అక్కడి అధికారులు ఈ కేసుతో సంబంధమున్న వారిని మళ్లీ విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వారం రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయాలని డిజిపి ఆదేశించినందున దానికి అనుగుణంగా అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే హత్యకు సంబంధించి ఇంకా ఎన్నో చిక్కుముళ్లు వీడలేదు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News