- Advertisement -
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఎ సోదాలు చేపట్టింది. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో మాజీ మావోయిస్టులు రవిశర్మ, అనురాధ ఇళ్లలో ఎన్ఐఎ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక, ఎపిలోని ప్రకాశంలో మాజీ మావోయిస్టు కళ్యాన్ రావు ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. గతంలో మావోయిస్టు పార్టీ చర్చల ప్రతినిధిగా కళ్యాణ్ రావు కొనసాగారు. మావోయిస్టుల సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతోపాటు ఇటీవల ఆర్కే జీవిత చరిత్ర పుస్తకం ప్రచురణపైనా ఆరా తీస్తున్నారు.
NIA Searches at Ex maoist houses in Telugu States
- Advertisement -