- Advertisement -
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పులేదని, ఆయనకు వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాసను అందచేయడం కొనసాగుతోందని ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రిసెర్చ్, రిఫరల్ ఆసుపత్రి వైద్యులు మంగళవారం తెలిపారు. 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పులేదని, ఆయన వైటల్ పారమీటర్స్ స్థిరంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం క్షీణించడంతో ప్రణబ్ ముఖర్జీ ఆగస్టు 10న సైనిక ఆసుపత్రిలో చేరారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళంలో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు ఆయనకు సర్జీరీ చేశారు. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. అంతేకాకుండా ఆపరేషన్కు ముందు చేసిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది.
No Changes in Pranab Mukherjee health condition
- Advertisement -