అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రతీరోజు 8 నుంచి 10వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 64,351 శాంపిల్స్ను పరీక్షించగా.. కొత్తగా 9,927 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 92మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3,71,639కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 3,368 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 89,932మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటివరకు 2,78,247మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు 33,56,852 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
9927 New Corona Cases Registered in AP