- Advertisement -
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ ప్రస్తుతం యుకె జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నీరవ్ మోదీ భార్య అమీ మోదీపై మంగళవారం నోటీసులు జారీ చేసింది. నీరవ్ మోదీపైనా, ఆయన భార్య అమీపైనా భారత్ లో మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఇడి కేసులు నమోదు చేసింది. వారిపై సిబిఐ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఇడి, సిబిఐ కేసులున్న నేపథ్యంలో అమీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక ఆమె ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేయవచ్చని అధికారులు తెలిపారు.
Interpol issues red notice against Nirav Modi wife
- Advertisement -