ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. వరుసగా సక్సెస్ ఉన్న దర్శకులను లాక్ చేసి ఇండస్ట్రీ రికార్డులను కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇది చిత్తూరు యాస నేపథ్యంలోని రఫ్ అండ్ ఠఫ్ యాక్షన్ మూవీ. గంధపు చెక్కల స్మగ్లర్ల కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో హిందీ మార్కెట్ లోనూ గ్రిప్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల దర్శకత్వంలో నటించేందుకు బన్నీ పర్ఫెక్ట్ ప్లానింగ్తో మూవ్ అవుతున్నాడట.
అంతేకాదు, పాన్ ఇండియా రేంజ్ను అందుకునేందుకు కొరటాలతో స్క్రిప్టు పరంగా దూరదృష్టితో ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. కొరటాల స్టైల్లో సామాజిక సందేశంతో పాటు యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథనే ఎంచుకున్నాడట. ఇదొక్కటే కాదు.. ఇప్పటికే ఈ మూవీ కోసం పలువురు బాలీవుడ్ నటీనటులను లాక్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప’తో పోలిస్తే పరాయి భాషా నటులకే ప్రాధాన్యత ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే కథానాయికగా ఎవరైనా బాలీవుడ్ నాయికనే ఎంపిక చేసే వీలుందని తెలిసింది.
Allu Arjun-Koratala Film to make Pan Indian Movie