Sunday, April 28, 2024

హైకోర్టుల పేర్లను మార్చే ప్రతిపాదన లేదు : కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో హైకోర్టుల పేర్లను మార్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బాంబే, కలకత్తా, మద్రాస్ హైకోర్టుల పేర్లకు సంబంధించి 2016లో హైకోర్టుల పేరు మార్పు బిల్లును తీసుకువచ్చింది. తరువాత ఈ జాబితాల్లో మరిన్ని పేర్లను చేర్చింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా, ఈ బిల్లు ప్రతిపాదన విరమించుకున్నట్టు న్యాయశాఖ మంత్రి అరుజన్ రామ్ మేఘ్వాల్ రాజ్య సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కొన్ని హైకోర్టుల పేర్లు మార్పు ప్రతిపాదనల గురించి మంత్రి వివరించారు. మద్రాస్ పేరుమార్పు చట్టం 1996 ప్రకారం మద్రాస్ పేరును చెన్నైగా మర్చారు.

తరువాత మద్రాస్ హైకోర్టు పేరును చెన్నై హైకోర్టుగా మార్చాలనే ప్రతిపాదనను 1997లో పంపించింది. ముంబై, కోల్‌కతాలలో ఉన్న హైకోర్టుల పేరులను మార్చాలనే ఉద్దేశంతో వాటిని పరిగణన లోకి తీసుకున్నాం. ఆ తర్వాత ఒరిస్సాఒడిశాగా, గౌహతిగువాహటిగా మారినందున ఆ జాబితాలో వీటిని కూడా చేర్చాం. కానీ సంప్రదింపుల సమయంలో పేరును మార్చే ప్రతిపాదనలకు మిగతా రాష్ట్రాల నుంచి అంగీకారం వచ్చినప్పటి నుంచి తమిళనాడుతోపాటు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన తెచ్చే ఆలోచన లేదు ’ అని కేంద్ర మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News