Friday, May 3, 2024

పార్లమెంట్ కాదు.. మోడీ మల్టీప్లెక్స్

- Advertisement -
- Advertisement -

జైరాం రమేశ్ తీవ్ర విమర్శ.. బిజెపి కౌంటర్!

న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ మోడీ మల్టీప్లెక్స్ అని కాంగ్రెస్ విమర్శించింది. నూతన భవ నంలో చర్చలు కనుమరుగ య్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విటర్ వేదికగా ఆరోపించారు. కొత్త పార్లమెంట్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన సమావేశాలను ప్ర స్తావిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇ చ్చింది. “నూతన పార్లమెంట్ మోడీ మల్టీప్లెక్స్ లేదా మారియట్. కొత్త భవనంలో నాలుగు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో చా లా విషయాలను గమనించా. ఈ భవనం ప్రధాని మోడీ లక్ష్యాలను చాలా బాగా అర్థం చేసుకోగలిగింది. చట్టసభల్లో చర్చలు కను మరుగైనట్టుగా అనిపిస్తోంది. పార్లమెంట్ ఆవరణలో కూడా ఇదే కొనసాగుతోంది. రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు చేయకుండానే ప్రధాని విజయం సాధించారు” అని విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ఆయన పాత పార్లమెంట్‌ను గుర్తు చేసుకున్నారు. పాత పార్లమెంట్‌లో ప్రతిసభ్యుడితో చర్చలు జరిపే అవకా శం ఉండేదన్నారు. ప్రస్తుతం సభ్యులను చూసేందుకు బైనా క్యుల ర్ అవసరం ఉంటుందేమో అంటూ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సం ధించారు. ఇవి సమావేశాలను చర్చలను బలహీన పరుస్తాయని ఆరోపించారు. గతంలో సెంట్రల్‌హాల్, కారిడార్లలో నడిచేందుకు వీలుండేదని, ఇక్కడ చాలా ఇరుకుగా ఉన్నట్టు అనిపిస్తోందని అన్నారు. మళ్లీ పాత పార్లమెంట్ వెళ్లేందుకు ఎదురుచూస్తుంటాను అని జైంరామ్ రమేశ్ అన్నారు. జైరాం రమేశ్ చేసిన వ్యా ఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై బీజేపీ జాతీ యాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. “ కాంగ్రెస్ పాటించే అత్య ల్ప ప్రమాణాల్లో ఇదీ ఒకటి. ఈ చర్య ద్వారా కాంగ్రెస్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అవమానిస్తోంది. పార్లమెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడడం ఆ పార్టీకి ఇది మొదటిసారి కాదు. గతం లోనూ ఈ విధంగా మాట్లాడి విమర్శల పాలైంది” అని కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News