Saturday, May 11, 2024

ప్రజావాణి సమస్యలపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • మొత్తం 73 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా

మెదక్: ప్రజలు తమతమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు సమస్యల పరిష్కారని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి. వెంకటేశ్వర్లుతో కలి సి కలెక్టర్ ఆర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో భూ సమస్యలకు సంబంధించినవి 20, వివిధ శాఖలకు సంబంధించినవి 53 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన ప్రతి దరఖాస్తులను పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News