Saturday, May 18, 2024

శంషాబాద్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు..

- Advertisement -
- Advertisement -

Omicron Case Registered in Shamshabad

రంగారెడ్డి: శంషాబాద్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన బాలుడికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రానగర్ లో పదిరోజుల కిందట దుబాయ్ నుంచి వచ్చిన ఓ బాలుడు(15)కి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సీకి పంపించారు. ఇందులో బుధవారం ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. ప్రైమరీ కాంటాక్టు ఉన్న 40 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ముగ్గురికి పాజిటీవ్ వచ్చింది. దీంతో బాధితులు హోం ఐసోలేషన్లోనే చికిత్స పొందుతున్నారు.

Omicron Case Registered in Shamshabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News