Sunday, April 28, 2024

పాలమూరు రంగారెడ్డి కి పచ్చని సంకేతం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ : పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొద టి లిఫ్ట్ వద్ద మొదటి పంప్ డ్రై రన్ సక్సెస్ అయ్యిం ది. ఆదివారం ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఇఎన్‌సి మురళీధర్, రాష్ట్ర సాగునీటి ప్రా జెక్టుల ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, చీఫ్ ఇంజనీర్ హమీద్ ఖాన్‌ల పర్యవేక్షణలో ఇంజనీరింగ్ అధికారులు డ్రై రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. 12.3 లక్షల ఆయకట్టుకు కృష్ణా నది ద్వా రా నీరు అందించే భారీ సాగునీటి ప్రాజెక్టును రికా ర్డు సమయంలో సాంకేతిక అనుమతులు పొం దుతూ నీటిని ఎత్తిపోసే దిశగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మోటార్లను ఏర్పాటు చేసి భూగర్భంలోనే మోటార్లను అ మర్చే అద్భుతమైన ఇంజినీరింగ్ టెక్నాలజీతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కృష్ణానది పరివాహక ప్రాంతమైన నార్లాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

ఒక్కో లిఫ్ట్ వద్ద 8 మోటార్ల ద్వారా రోజు 2 టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా మోటార్లను ఏర్పాటు చేశారు. మొదటి లిఫ్ట్ వద్ద ఆదివారం ఒక మోటార్‌కు డ్రై రన్ పూర్తిచేయగా మరో 15 రోజుల్లో రెం డవ మోటార్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ప్రాజెక్టు సలహాదారులు పెంటారెడ్డి తెలిపారు. ఈ నెల 15వ తేదిన నీటిని ఎత్తిపోయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 140 మెగా వాట్ల భారీ విద్యుత్‌తో ఒక్కో మోటార్ నడుస్తుంది. ప్రతి మోటార్‌కు యూనిట్ల వారీగా విద్యు త్ సౌకర్యం కల్పించారు. భూగర్భంలో మోటార్లు అమర్చగా భూ ఉపరితలంపై ప్యానెల్ బోర్డులు, విద్యుత్ ఇతర నిర్వహణ ఏర్పాట్లను చేశారు. భూగర్భంలో ఉండే మోటార్ల వద్ద కేవలం సిసి కెమెరాల పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని పెంటారెడ్డి తెలిపారు. కృష్ణా నది నుంచి నీరు నేరుగా హెడ్ రెగ్యులేటర్ గేట్ల వద్దకు రాగా అక్కడి నుంచి ఫోర్‌వే ద్వారా నీరు టన్నెళ్లకు, ఆ తర్వాత సర్జిపుల్‌కు, డ్రాఫ్ట్ గేట్ల ద్వారా నీటిని నేరుగా నీటిని ఎత్తిపోసే పంపులకు అందించడం జరుగుతుంది. ఒక్కో మోటార్ 3 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే విధంగా డిజైన్ రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News