Tuesday, April 30, 2024

వికారాబాద్‌లో రైలు-ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కున్న ప్రయాణికుడు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: కదులుతున్న రైలు ఎక్కుతున్న క్రమంలో రైలు-ప్లాట్‌ఫామ్ మధ్య ఓ ప్రయాణికుడు ఇరుక్కున్న సంఘటన వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. రాయ్‌చూర్ చెందిన ప్రయాణికుడు రైల్వే ఎక్కే క్రమంలో రైలు-ప్లాట్‌ఫామ్ మధ్య పడిపోయాడు. రైలు అలాగే కదులుతూ కొంచెం దూరం వెళ్లిపోవడంతో అతడు నరకయాతన అనుభవించాడు. వెంటనే రైల్వే పోలీసులు స్పందించి ప్లాట్‌ఫామ్‌ను పగులగొట్టారు. రెండు గంటల పాటు ఆ ప్రయాణికులు ఆర్తనాదాలు కన్నీళ్లు తెప్పించాయి. ప్లాట్‌ఫామ్ పగులగొట్టి ప్రయాణికుడిని బయటకు తీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News