Friday, April 26, 2024

చెరుకు రైతుల బకాయిలను చెల్లించండి: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Pay arrears of sugarcane farmers said Minister Harish

హైదరాబాద్ : చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను ఈ నెల 18వ తేదీలోగా చెల్లించాలని ట్రైడెంట్ సుగర్స్ ఫ్యాక్టరీ యజమాన్యాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుఆదేశించారు. గడువులోగా చెల్లించికపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కంపెనీపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పారిశ్రామిక వేత్తలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అవసరమైన వాతావరణం కల్పించిదన్నారు. ఇలాంటి తరుణంలో రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు గురి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. జహీరాబాద్ పరిధిలో 9 వేల మంది చెరకు రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని స్పష్టం చేశారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో ఈ నెల 11వ తేదీన రూ.5కోట్లు, 18వ తేదీన రూ.8 కోట్లు చెల్లించాలని మంత్రి హరీశ్ రావు సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులను ఆదేశించారు.

గురువారం హైదరాబాద్‌లోని ఎంసిహెచ్‌ఆర్‌డిలో చెరుకు రైతుల సమస్యలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. వారికి న్యాయం జరిగిన తరువాతనే ఇతర అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే చెరకు రైతులు ట్రైడెంట్ యాజమాన్యం పై విశ్వాసం కోల్పోయారన్నారు. దానిని తిరిగి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత యజమాన్యంపైనే ఉందని అన్నారు. ప్రతి ఎడాది చెరకు కొనుగోలు ఒప్పందాలు రైతులతో పారదర్శకంగా చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఇతర సుగర్స్ ఫ్యాక్టరీలు చెల్లిస్తున్న రీతిలో రైతులకు అదే ధర చెల్లించాలన్నారు.

రైతుల సమక్షంలో నే సుగర్స్ ఫ్యాక్టరీ నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. తక్షణ, దీర్ఘ కాలిక ప్రణాళికలు తయారు చేసి సుగర్స్ ఫ్యాక్టరీని సమర్థవంతంగా నడపాలన్నారు. అలాగే రైతులకు చెరుకు అమ్మకాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం సహించేది లేదన్నారు. సుగర్ ఫ్యాక్టరీ నిర్వహణ విషయంలో ఎదైనా సహకారం కావాల్సి వస్తే నిబంధనలకు అనుగుణంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హరీశ్‌రావు స్ప్టం చేశారు. కాగా మంత్రి ఆదేశాల మేరకు సుగర్ ఫ్యాక్టరీ ప్రతినిధులు 11వ తేదీన ఐదుకోట్లు, 18వ తేదీన మిగతా ఎనిమిది కోట్ల రూపాయలను చెల్లిస్తామని వారు హమీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఎంపిలు బిబి పాఠిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు జిఆర్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిడిసి ఛైర్మన్ ఉమాకాంత్, డిసిఎంఎస్ ఛైర్మన్ శివ కుమార్, సుగర్ కేన్ డైరెక్టర్ రవీందర్ రావు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News