- Advertisement -
న్యూఢిల్లీ: తప్పుడు వాగ్దానాల బాధితులైన దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోడీ మాటల్ని నమ్మేందుకు సిద్ధంగా లేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన నేపథ్యంలోనూ రైతు సంఘాలు తమ సత్యాగ్రహాన్ని కొనసాగిస్తామన్నారని రాహుల్ ట్విట్టర్ వేదికగా గుర్తు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికాలంగా నిరసన చేపట్టిన రైతు సంఘాలు ఇప్పుడే తమ ఆందోళనను విరమించబోమని తేల్చి చెప్పడం గమనార్హం. పార్లమెంట్ ద్వారా చట్టాల రద్దు ప్రక్రియ పూర్తి కావాలని, కనీస మద్దతు ధర(ఎంఎస్పి)కి చట్టపరమైన హామీ కల్పించాలని రైతు సంఘాలు షరతులు విధిస్తున్నాయి.
- Advertisement -