Friday, May 3, 2024

భూగర్భ జలాల పరిరక్షణ మనందరి బాధ్యత

- Advertisement -
- Advertisement -

People save Groundwater

హైదరాబాద్: అపర భగీరథుడు మన ముఖ్య మంత్రి కె.సి.ఆర్ రాష్ర్ట ప్రజలు సాగు నీటి, త్రాగు నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ నీటి దినోత్సవాలను పురష్కరించుకొని జల మండలి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ సంయుక్త ఆధ్వర్యంలో భూగర్భ జలాల పరిరక్షణ అవగాహన కార్యక్రమంలో భాగంగా మంత్రుల నివాస ప్రాంగణంలోని వ్యవసాయ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. మూడేళ్లలో ప్రపంచంలో ఎత్తయిన కాళేశ్వరం నిర్మించామని, పాలమూరు రంగారెడ్డి 70 శాతం పూర్తి చేస్తామని, ఏడేళ్లలో తెలంగాణ కోటి ఎకరాలకు సాగు నీటిని అందిస్తూ దేశంలోనే వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేశారని కొనియాడారు. రైతన్నలే ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని, హైద్రాబాద్ నగర ప్రజల దాహర్తిని తీర్చడానికి ఎన్నో వందల కిలోమీటర్ల నుండి ఎన్నో వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి మంచి నీటిని నగరానికి తీసుకొచ్చి ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు.

రోజు రోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలను పరిరక్షించుకొని నీటి నిల్వలను పెంపొందించుకోవాల్సిన బాధ్యత నగర ప్రజల అందరిపై ఉందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి అవరణంలో విధిగా ఇంకుడు గుంతల ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాబోయే వర్షాకాలంలో ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని, రాబోయే తరాలకు నీటి నిల్వలను అందించాలన్నారు. ఈ సంధర్భంగా ప్లకార్డులు, కర్ర పత్రాల మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డి.జి.యం శ్రీనివాస్ రావు, జి.యం రాంబాబు, కార్మికులు, గాంధీ సంస్థల ప్రతినిధులు డా|| యానల ప్రభాకర్ రెడ్డి, డా||మైనేని వాణి, పి గిరిధర్ గౌడ్, నరేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News