Friday, April 26, 2024

చిట్యాలలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న రెండు గంటలకే వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Person dead with corona vaccine in nalgonda

 

నల్గొండ: నల్లగొండ జిల్లా చిట్యాలలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న రెండు గంటలకే ఓ వ్యక్తి చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… రాచమల్లు సత్యనారాయణ అనే వ్యక్తి (55) వట్టిమర్తి గ్రామంలో నివసిస్తున్నాడు. స్థానికంగా ఉంటే రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రభుత్వాస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాడు. అనంతరం ఇంటికెళ్లి అన్నం తిని పడుకున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది కలగడంతో అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వెంటనే అతడిని అంబులెన్స్‌లో నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బిపి పెరగడంతో గుండె పోటుతో అతడు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News