Sunday, April 28, 2024

మధ్యప్రదేశ్‌లో రూ. 121 దాటేసిన పెట్రోల్

- Advertisement -
- Advertisement -

Petrol price crosses Rs 121 per litre mark in Madhya Pradesh

భోపాల్: పొరుగు రాష్ట్రాలను ఆనుకుని ఉన్న మధ్యప్రదేశ్‌లోని శివారు జిల్లాలో మొట్టమొదటిసారి లీటరు పెట్రోల్ ధర రూ. 121 దాటింది. ఇక లీటరు డీజిల్ ధర రూ.110.29 చేరుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని అనుకుని ఉన్న అనుప్పూర్ జిల్లాలోని బిజూరి పట్టణంలో శనివారం లీటరు పెట్రోల్ ధర రూ. 121.13 చేరుకోగా లీటర్ డీజిల్ రూ. 110.29 నమోదైంది. పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 37 పైసల చొప్పున పెంపుదలతో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నట్లు పెట్రోల్ పంపు యజమాని అభిషేక్ జైశ్వాల్ తెలిపారు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జబల్‌పూర్ నుంచి అనుప్పూర్‌కు పెట్రోలియం రవాణా అవుతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ అధిక రవాణా చార్జీల కారణంగా పెట్రోల్ ధర అధికంగా ఉంటుంది. అదే భోపాల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.71, డీజిల్ ధర రూ. 107.13 ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News