Wednesday, May 8, 2024

పేలిన పెట్రోల్ ట్యాంకర్: 50 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Petrol tanker blast in Haiti

హైదరాబాద్: పెట్రోల్ ట్యాంకర్ పేలడంతో 50 మంది మృతి చెందిన సంఘటన కరీబియన్ ద్వీప దేశంలోని హైతీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కేప్ హైతియన్ ప్రాంతంలో రోడ్డు పై పెట్రోల్ ట్యాంకర్ వెళ్తుండగా పేలింది. జన సమూహం ఉన్న ప్రాంతంలో పేలడంతో 50 మంది వరకు సజీవదహనమయ్యారని స్థానిక డిప్యూటీ మేయర్ ప్యాట్రిక్ అల్మోనార్ తెలిపారు. భారీ పేలుడు సంభవించడంతో 20 ఇండ్లు పూర్తిగా కాలిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై దేశ ప్రధాని హెన్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య వంద వరకు ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News