Thursday, May 2, 2024

రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా…

- Advertisement -
- Advertisement -

రామ్ కథానాయకుడిగా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై ప్రొడక్షన్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 12న హైదరాబాద్‌లో సినిమా చిత్రీకరణ మొదలైంది. ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు నెలకొనేలా చేయడంలో విజయవంతమైన దర్శక నిర్మాతలు ఇప్పుడు రామ్ పోతినేనిని ఢీ కొట్టే ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టిని ఎంపిక చేశారు. ‘సరైనోడు’ సినిమాలో సూపర్ స్టయిలిష్ విలన్‌గా ఆది పినిశెట్టి అద్భుతంగా నటించారు. రంగస్థలం, నిన్ను కోరి, యు-టర్న్ సినిమాల్లో ఆయన మంచి పాత్రలు చేశారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి హీరోగా నటించిన రెండు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో బైలింగ్వల్ సినిమా షూటింగ్ ప్రారంభించారు. రెగ్యులర్ పాత్రల్లో నటించడం తనకు ఆసక్తి ఉండదని ఆది పినిశెట్టి ఎప్పుడూ చెబుతుంటారు. ఆయన చేస్తున్న సినిమాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. రామ్ పోతినేని మాస్ ఎంటర్‌టైనర్ మూవీలో విలన్ క్యారెక్టర్ యూనిక్‌గా ఉండటంతో పాటు క్యారెక్టరైజేషన్ నచ్చడంతో ఆ పాత్ర లో నటించడానికి ఆది పినిశెట్టి అంగీకరించారు. ఊర మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్, ఆది పినిశెట్టి మధ్య సన్నివేశా లు నువ్వా – నేనా అన్నట్టు ఉండబోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News