మెగాపవర్స్టార్ రామ్చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ ఓ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శంకర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి. శంకర్ రూపొందించిన ‘బాయ్స్’ సినిమాలో నటించిన తమన్ ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీకి సంగీతం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాలని ఆతృతగా తమన్ ఎదురుచూస్తున్నారు. శంకర్ నిర్మించిన ‘వైశాలి’(ఈరం) చిత్రంతోనే తమన్ సంగీత దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించడం విశేషం. ఇప్పటికే ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రంలో రామ్చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ రికార్డింగ్ పనిని హైదరాబాద్లో ఈ నెల 14,15వ తేదీల్లోనే ప్రారంభించారు. ఈ పాటను రికార్డ్ చేయడానికి శంకర్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ భారీ సాంగ్ కోసం 135 మంది మ్యూజిషియన్స్ పని చేయడం విశేషం. ఇందులో రామ్చరణ్ కూడా భాగమయ్యారు.
పాన్ ఇండియా మూవీకి తమన్ సంగీతం
- Advertisement -
- Advertisement -
- Advertisement -