- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 25న రైతులతో భేటీ కానున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని 2,500కి పైగా ప్రాంతాల్లో కిసాన్ సంవాదక్ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. కొత్తవ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాలపై ప్రతిక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా బిజెపి ప్లాన్ వేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 25న వాజ్ పేయి జయంతి సందర్భంగా ప్రధాని మోడీ రైతులతో సమావేశం కానున్నారు.
PM Modi to interact with farmers on 25 December
- Advertisement -