- Advertisement -
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం అంతారం స్టేజ్ వద్ద ఆదివారం రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్ ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారును ఢీకొన్న సమయంలో మంటలు చెలరేగి బైక్ దగ్ధం అయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అధిక వేగం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.One Death in Road Accident at Rangareddy
- Advertisement -