- Advertisement -
హైదరాబాద్: ఆన్లైన్ కాల్మనీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మైక్రో ఫైనాన్స్ యాప్లను రూపొందించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు నెలల నుంచి యాప్ల ద్వారా యువకుడు రుణాలు ఇస్తున్నాడు. డబ్బులు కట్టేది ఆలస్యమైతే మైక్రో ఫైనాన్స్ ఎజెంట్లు వేధింపులకు గురి చేస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ రుణాలకు 50 శాతంపైనే వడ్డీ చెల్లించినట్లు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. కాల్మనీ యాప్లను నిషేధించాలని కేంద్ర హోమ్ శాఖ, ఐటి శాఖలకు తెలంగాణ పోలీస్ శాఖ లేఖలు రాసింది.
- Advertisement -