- Advertisement -
న్యూఢిల్లీ : కోవిడ్-19పై పోరాటంలో భాగంగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈనెల 27న సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ జరుపనున్నారు. లాక్డౌన్ అమలుతో సహా కోవిడ్-19 అదుపునకు తీసుకుంటున్న చర్యలు, తాజా పరిస్థితులను ముఖ్యమంత్రులతో మోదీ సమీక్షిస్తారు. కరోనాపై పోరాటంలో భాగంగా లాక్డౌన్ అనంతరం ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటం ఇది మూడోసారి. కాగా, కేంద్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా కరోనా కేసులు 20,471కు చేరుకున్నాయి. వీటిలో 15,859 యాక్టివ్ కేసులు కాగా, 3,958 మందికి పూర్తి స్వస్థత చేకూరి డిశ్చార్చి అయ్యాయి. 652 మరణాలు సంభవించాయి.
PM Modi videoconference with CMs on 27th
- Advertisement -