- Advertisement -
నలుగురు యాడాసురుల అరెస్టు
వారణాసి : అమ్మకానికి ప్రధాని మోడీ వారణాసి కార్యాలయం అని పేర్కొంటూ ఆన్లైన్ ప్రకటన వెలువడింది. దీనితో కంగుతిన్న అధికారులు రంగంలోకి దిగి శుక్రవారం ఇందుకు బాధ్యులైన నలుగురిని అరెస్టు చేశారు. ఒఎల్ఎక్స్ విక్రయ వెబ్సైట్లో వెలువడ్డ ఈ యాడ్లో స్థానికంగా ఉండే మోడీ కార్యాలయం చిత్తరువును కూడా పొందుపర్చారు. అమ్మకానికి సిద్ధం, కొనుక్కునే వారికి స్వాగతం అని దీనిని సైట్లో ప్రవేశపెట్టారు. జవహర్ నగర్ ప్రాంతంలో ప్రధాని మోడీకి సంబంధించిన ఆఫీసు ఉంది. వారణాసి లోక్సభ స్థానానికి ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడి అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణకు సిబ్బందితో కూడిన ఆఫీసు కూడా ఏర్పాటు అయి ఉంది. ప్రకటనను తీసుకుని వెలువరించిన ఒఎల్ఎక్స్ నిర్వాహకులు తరువాతి ఫిర్యాదు, అరెస్టుల క్రమంలో యాడ్ను ఎత్తివేశారు.
- Advertisement -