ఆక్లాండ్: పాకిస్థాన్తో శుక్రవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కివీస్ 18.5 ఓవర్లలోనే కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (6), వన్డౌన్లో వచ్చిన డెవాన్ కాన్వే (5) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే మరో ఓపెనర్ టిమ్ సిఫర్ట్ అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు.
అతనికి గ్లెన్ ఫిలిప్స్ (23), మార్క్ చాప్మాన్ (34) అండగా నిలిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సిఫర్ట్ ఆరు ఫోర్లు, సిక్స్తో 57 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ను జాకబ్ డుఫ్పి, కుగ్లేజిన్ హడలెత్తించారు. అద్భుత బౌలింగ్ను కనబరిచిన జాకబ్ డుఫ్పి నాలుగు వికెట్లు పడగొటటారు. కుగ్లేజిన్ మూడు వికెట్లు తీసి తనవంతు పాత్ర పోషించాడు. పాక్ జట్టులో కెప్టెన్ షాదాబ్ ఖాన్ (42) మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. ఇక ధాటిగా ఆడిన ఫహిమ్ అశ్రఫ్ 3 సిక్సర్లు, రెండు ఫోర్లతో 31 పరుగులు సాధించాడు. దీంతో పాక్ స్కోరు 153 పరుగులకు చేరింది. జాకబ్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది.