Sunday, May 5, 2024

మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఖరారు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈ నెల 8న(శనివారం) ఉదయం 9.50 గంటలకు ప్రధాని మోడీ హకీమ్ పేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఉదయం 10.35కి వరంగల్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్ లో ప్రధాని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

తర్వాత ఉదయం 11.30కు బిజెపి నిర్వహించే భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు.అనంతరం మధ్యాహ్నాం 12.15కి మోడీ వరంగల్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నాం 1.10 నిమిషాలకు ప్రధాని మోడీ హకీమ్ పేట విమానాశ్రయంకు చేరుకుని, 1.15 నిమిషాలకు రాజస్థాన్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.

Also Read: అందరం కలిసి బిజెపిని అధికారంలోకి తీసుకొస్తాం: డికె అరుణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News