Monday, April 29, 2024

మహారాష్ట్రలో ట్రక్కు బీభత్సం.. 10మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ధులే జిల్లాలోని షిర్పూర్ తాలూకాలో మంగళవారం ఉదయం వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 20మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News