- Advertisement -
భోపాల్: మహిళ మాస్క్ ధరించలేదని ఆమెను పోలీసులు కాళ్లతో తన్నిన సంఘటన మధ్య ప్రదేశ్లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ మహిళ తన కూతురుతో కలిసి సామాన్లు తీసుకరావాడానికి మార్కెట్కు వెళ్తోంది. ఆమె మాస్క్ ధరించకపోవడంతో మహిళా పోలీసులు పట్టుకొని దాడి చేశారు. ఓ కానిస్టేబుల్ మాత్రం ఆమె చేయి పట్టుకొని కాళ్లతో తన్నుతుంటే ఓ మహిళ కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లింది. అక్కడ ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేరస్థులను కూడా ఇంత దారుణంగా చితకబాదడం చూడలేదని, ఒక్క మాస్క్ పట్టుకోనందుకు ఇంతలా దాడి చేయాలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోలీసులా? లేకా రాక్షసులా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -