Sunday, May 5, 2024

క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Police busts cricket betting in hyderabad

హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.45,000 స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన కర్నాటి సుధీర్ అలియాస్ రాజా సికింద్రాబాద్‌లో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ప్రధాన బూకీ తరఫున నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఫిల్మీ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు.

వచ్చే డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో ఐపిఎల్ క్రికెట్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. పరాచీ తరఫున www. mpl24.comలో బాల్ టు బాల్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. నగరంలోని 20 నుంచి 25మంది పంటర్ల సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. బెట్టింగ్‌లో పాల్గొనే వారికి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ఇస్తున్నాడు. విషయం పోలీసులకు తెలియడంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సై పరమేశ్వర్ తదితరులు నిందితుడిని పట్టుకున్నారు.

Police busts cricket betting racket in hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News