Wednesday, May 8, 2024

మూగజీవాల మృతిపై పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

police complaint on cats dying in hyderabad

పేట్‌బషీరాబాద్: అనుమానాస్పద స్థితిలో మూగజీవాలు మృతిచెంది దర్శనం ఇస్తున్నాయని, వీటిపై సమగ్ర విచారణ జరుపాలని కోరుతూ ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేసిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం….. గుండ్లపోచంపల్లిలోని స్పెం డిడ్ అపర్ణ ఫామ్ డోస్ గ్రేటెడ్ కమ్యూనిటీ లో నివాసం ఉంటున్న అనిత పీటర్స్, అనిషా చౌదరిలకు ఇటీవల కాలంలో పలుమార్లు విల్లా నంబర్ 132 సమీపంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మూగ జీవాలు (పిల్లి) తీవ్రంగా గాయపరిచి రెండు కాళ్ళు తాళ్లతో కట్టి హింసాత్మకమైన రకంగా వాటిని చంపుతున్నారని గుర్తించారు. ఈ విషయం పై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఇద్దరు మహిళలు కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా పుండురుకు చెందిన ప్రభుత్వ వెటర్నరీ వైద్యులచే పిల్లికి పోస్టుమార్టం చేపట్టి పంచనామా చేశారు. వరుసగా మూగ జీవాలు మృత్యువాత పడుతున్న సంఘటనపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులే కావాలని చేస్తున్నారా లేక ఏ ఇతర కారణాల చేత మృత్యువాత పడుతున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News