- Advertisement -
చండీగఢ్: గురుదాస్పూర్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో 11 హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నామని పంజాబ్ పోలీసులు తెలిపారు. సరిహద్దుకు కిలోమీటర్ దూరంలోని సలాచ్ అనే గ్రామం వద్ద ఆదివారం రాత్రి వీటిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా సీనియర్ ఎస్పి రాజీందర్సింగ్సోహాల్ తెలిపారు. పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా ఉగ్రవాదుల కోసం వీటిని జారవిడిచినట్టు అనుమానిస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో రాత్రివేళ ఓ డ్రోన్ ఆ ప్రాంతంలో సంచరించగా గమనించిన బిఎస్ఎఫ్ దళాలు దానిపై కాల్పులు కూడా జరిపారని సోహాల్ తెలిపారు. డ్రోన్ల ద్వారా పంజాబ్ సరిహద్దులో ఆయుధాలను జారవిడిచిన మొదటి సంఘటన 2019 ఆగస్టులో జరిగింది. అప్పుడు ఎకె47 రైఫిళ్లుసహా హ్యాండ్ గ్రెనేడ్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత ఇలాంటి మరికొన్ని సంఘటనలు జరిగాయి.
- Advertisement -