- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ః శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో సోమవారం నాడు భారీగా కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుండి షార్జా వెళ్తున్న ప్రయాణికుడి వద్ద రూ.33 లక్షల కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. హైద్రాబాద్ చాంద్రాయణగుట్ట ప్రయాణికుడి లగేజ్ తనిఖీ చేసిన సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఆధికారులు అందులో 33 లక్షల కరెన్నీని గుర్తించారు. వెంటనే నిందితుని అదుపులోకి తీసుకున్న సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఆధికారులు కరెన్సీ తో పాటు నిందితుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కరెన్నీకి సంబంధించి నిందితుడిని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. అసలు ఆ నిందితుడు ఎవరు, అతని వెనుక ఎదైనా స్కామ్ ఉందా అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Rs 33 lakh currency Seized at Shamshabad Airport
- Advertisement -