Saturday, May 4, 2024

ఛత్తీస్‌గడ్‌లో రెండు దశలలో..మిగిలిన 4 రాష్ట్రాలలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో 579 అసెంబ్లీ నయిఓజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నట్లు ఆయన ప్రకటించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనావళి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.

రాజస్థాన్‌లో ఎన్నికల షెడ్యూల్:
ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 21, 2023.
నామినేషన్ల గడువు తేదీ: అక్టోబర్ 31, 2023.
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 31, 2023
నామినేషన్ల ఉపసంహరణ గడువు తేదీ: నవంబర్ 2, 2023
పోలింగ్: నవంబర్ 17, 2023
కౌంటింగ్: డిసెంబర్ 3,2023

మధ్యప్రదేశ్‌లో:
ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 13.
నామినేషన్ల గడవు తేదీ: అక్టోబర్ 20.
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 21.
పోలింగ్: నవంబర్ 7.
కౌంటింగ్: డిసెంబర్ 3.

మిజోరంలో:
ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 13.
నామినేషన్ల గడువు: అక్టోబర్ 20.
నామినేషన్ల పరిశీలన: అక్టబోర్ 21.
నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టబోర్ 23.
పోలింగ్: నవంబర్ 7.
కౌంటింగ్: డిసెంబర్ 3.

ఛత్తీస్‌గఢ్(రెండు దశలు):
ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 3
నామినేషన్ల గడువు: అక్టోబర్ 20, అక్టోబర్ 30(రెండవదశ).
నామినేషన్ల పరిశీలన: అక్టబోర్ 21, అక్టోబర్ 31(రెండవ దశ)
నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 23, నవంబర్ 2(రెండవ దశ)
పోలింగ్: నవంబర్ 7(మొదటి దశ), నవంబర్ 17(రెండవ దశ)
కౌంటింగ్: డిసెంబర్ 3

తెలంగాణ:
నోటిఫికేషన్ విడుదల: నవంబర్ 3
నామినేషన్ల గడువు తేదీ: నవంబర్ 10.
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 13.
నామినేషన్ల ఉపసంహరణ గడువు తేదీ: నవంబర్ 15.
పోలింగ్ తేదీ: నవంబర్ 30.
కౌంటింగ్: డిసెంబర్ 3.
ఎన్నికల ప్రక్రియ ముగింపు: డిసెంబర్ 5.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News