Sunday, April 28, 2024

మళ్లీ వస్తున్న ‘యోగి’..

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, నయనతార జంటగా స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘యోగి’ 2007వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ప్రభాస్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. పి. రవీంద్రనాథ్‌రెడ్డి సమర్పణలో ఈశ్వరి ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుదర్శన్‌రెడ్డి, చంద్ర ప్రతాప్‌రెడ్డిలు నిర్మించారు. రమణగోగుల సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. తాజాగా ఈ చిత్రాన్ని చందు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై లింగం యాదవ్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం ఈ చిత్రాన్ని 4కె ఫార్మట్‌లోకి మార్చారు.

దిల్‌రాజు, శిరీష్‌ల సహకారంతో ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతున్న సందర్భంగా ఈ చిత్రం రీ రిలీజ్ టైలర్, పోస్టర్‌లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు రమణ గోగుల సినిమా ట్రైలర్, పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రమణ గోగుల మాట్లాడుతూ.. ‘టెక్నాలజీని వాడుకుని ఈ సినిమాను మంచి క్వాలిటీతో తీసుకొస్తున్నారు. సౌండ్ చాలా బాగా వచ్చింది’ అన్నారు.

లింగం యాదవ్ మాట్లాడుతూ.. ‘చాలా కష్టపడి ఈ సినిమాను 4కె ఫార్మట్‌లోకి మార్చాము. ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రభాస్ గారి అభిమానుల్లో చాలామంది చిన్న పిల్లలుగా ఉండి ఉంటారు. వారు ఇప్పుడు దీన్ని థియేటర్స్‌లో చూసి ఆనందిస్తారని ఖచ్చితంగా చెపుతాను. రమణ గోగుల గారు అందించిన సంగీతం, వినాయక్ గారి దర్శకత్వ ప్రతిభ, సుదర్శన్‌రెడ్డి, చంద్ర ప్రతాప్‌రెడ్డి గార్ల రాజీలేని నిర్మాణ విలువలు ఈ సినిమాను గొప్పగా తీర్చిదిద్దాయి. రీరిలీజ్‌లో కూడా ఇది సూపర్‌హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, నవీన్‌చంద్రరాజు, మాధవి, డిస్ట్రిబ్యూటర్స్ రమేష్, అచ్చిబాబు, రఘురామరెడ్డి, అక్సాఖాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News