న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మఖర్జీ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీ 10 రాజాజీ మార్గ్ నివాసం నుంచి సాధారణ అంబులెన్స్ లో లోధి శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. గన్ క్యారేజ్ పై కాకుండా సాధారణ అంబులెన్స్ లో తరలిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు లోధి శ్మశాన వాటికలో ప్రణబ్ అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. సైనిక లాంఛనాలతో ప్రణబ్ కు ఘనంగా అంతిమ వీడ్కోలు ఇవ్వనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక దూరం, ఇతర నిబంధనలు కచ్చితంగా పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు ఆయన చిత్రపటానికి పలు పార్టీలకు చెందిన నాయకులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.
#WATCH Delhi: The mortal remains of former President #PranabMukherjee brought to Lodhi Crematorium.
He had tested positive for #COVID19 and had undergone surgery for a brain clot at Army (R&R) Hospital on August 10, where he passed away yesterday. pic.twitter.com/24h4hHxZ2L
— ANI (@ANI) September 1, 2020
Pranab Mukherjee’s final journey begins