Sunday, April 28, 2024

స్థిరాస్తులు లేని మోడీ

- Advertisement -
- Advertisement -

ఉన్న ఇంటి స్థలం విరాళం
సొంత వాహనం కూడా లేదు
బ్యాంకు బ్యాలెన్స్
రూ.35,350 పోస్టాఫీసులో నేషనల్
సేవింగ్స్ సర్టిఫికెట్ రూ.9లక్షలు
ఆస్తుల వివరాలు ప్రకటించిన ప్రధాని

స్థిరాస్తులు లేని
ప్రధాని మోడీ
ఉన్న కాస్త నివాసయోగ్య భూమి విరాళం
సొంత వాహనం కూడా లేదు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఆస్తులు గతంతో పోలిస్తే కాస్త పెరిగినప్పటికీ తన వద్ద ఉన్న భూమిని విరాళంగా ఇచ్చేయడంతో ఎలాంటి స్థిరాస్తులు లేవని తేలింది. ఏడాది క్రితం మోడీ చరాస్తులు 2021 మార్చి 31 నాటికి రూ. 26.13 లక్షలుగా ఉండేవి. రూ. 1.1 కోట్ల విలువైన స్థిరాస్తి ఉంటే దాన్ని విరాళంగా ఇచ్చేశారు. ఈ భూమిని గుజరాత్ లోని గాంధీనగర్‌లో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ. 2.23 కోట్లుగా ఉంది. వీటిలో అధికంగా బ్యాంకు డిపాజిట్ల రూపం లోనే ఉన్నాయి. ఏటా మోడీ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించడం పరిపాటిగా వస్తోంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. పిఎంవొ వెల్లడించిన వివరాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ప్రధాని ఆస్తులు రూ. 26 లక్షల మేర పెరిగాయి. బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో మోడీకి పెట్టుబడులు లేవని, ఆయనకు సొంత వాహనం కూడా లేదని పిఎంఒ వెల్లడించింది. అయితే సుమారు రూ.1.73 లక్షల విలువైన మూడు బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి మోడీ వద్ద ఆస్తులు రూ.2,23,82,504 వరకు ఉన్నాయి.

అలాగే అప్పటికి మోడీ చేతిలో కేవలం రూ. 35, 350 నగదు మాత్రమే ఉంది. అలాగే పోస్టాఫీస్ లోని నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ విలువ రూ.9,05,105 , జీవిత బీమాపాలసీల విలువ రూ. 1,89,305గా ఉన్నా యి. 2002 అక్టోబర్‌లో మోడీ గుజరాత్ సిఎంగా ఉన్న సమయంలో మరో ముగ్గురు వాటాదార్లతో కలిసి కొనుగోలు చేసిన నివాస యోగ్య భూమి (సర్వే నంబర్ 401/ఎ)లో ఒక్కొక్కరికి 25 శాతం వంతున సమాన వాటా ఉందని, దాన్నే మోడీ విరాళంగా ఇచ్చినట్టు తెలిపింది. ప్రధాని మోడీతోపాటు కేబినెట్ మంత్రుల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రూ.2.54 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉండగా, రూ.న 2.97 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. మొత్తం 29 మంది కేబినెట్ మంత్రులు ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో తమ సొంత, వారిపై ఆధారపడిన వారి ఆస్తులు ప్రకటించిన వారిలో ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్‌కే సింగ్, హర్‌దీప్‌సింగ్ పురి, పురుషోత్తం రూపాలా, జి. కిషన్ రెడ్డి ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కేబినెట్ మంత్రిగా పనిచేసి, గత నెల లోనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ముక్తార్ నఖ్వీ కూడా తన ఆస్తుల వివరాలను ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News