- Advertisement -
హథ్రాస్ : దళిత మహిళ కుటుంబానికి పూర్తి న్యాయం కోసం తమ పోరు సాగిస్తామని రాహుల్, ప్రియాంకలు శనివారం ప్రకటించారు. అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసిన తరువాత తాజాగా ప్రియాంకగాంధీ హథ్రాస్ ఘటనలో జిల్లా మెజిస్ట్రేట్ పాత్రపై విచారణ జరపాలని అన్నారు. అంతేకాకుండా విధుల నుంచి తొలగిస్తూ వెంటనే ఆదేశాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ బాధితులతో దురుసుగా ప్రవర్తించిన తీరు గురించి వారిని కలిసిన తరువాత తెలిసిందని, జిల్లా మెజిస్ట్రేట్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి ఘటనలో ఆయన పాత్రపై విచారణ చేపట్టాలని అన్నారు. బాధితులు న్యాయ విచారణకు డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఎందుకు సిబిఐ, సిట్ దర్యాప్తును చేపడుతోందని, యూపి ప్రభుత్వం కాస్త నిద్రమత్తు నుంచి మేల్కోని బాధితుల గోడు వినాలి అంటూ ఆమె విమర్శించారు.
- Advertisement -