Sunday, May 5, 2024

శనివారం మాత్రమే పూరీ జగన్నాధుని దర్శనానికి అనుమతి

- Advertisement -
- Advertisement -

Puri temple reopens for devotees on Saturdays

పూరి : కరోనా థర్డ్ వేవ్ ఆందోళన నేపథ్యంలో నేటి నుంచి ప్రతివారంలో శనివారం మాత్రమే పూరీ జగన్నాధ ఆలయం లోకి భక్తులను అనుమతించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా నాలుగు నెలల తరువాత ఆగస్టు 23న భక్తుల కోసం తిరిగి ఆలయాన్ని తెరిచారు. అప్పటి నుంచి వారానికి ఐదు రోజులు అనుమతిస్తున్నారు. అయితే కరోనా నిబంధనలు మరింత కఠినం చేసి వారానికి శనివారం మాత్రమే భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. భక్తులు టీకా రెండు డోసులు తీసుకోవడమే కాదు, కొవిడ్ నెగిటివ్ రిపోర్టు కూడా సమర్పించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News