Saturday, May 4, 2024

మా అమ్మను చూస్కోవాలి… విచారణకు రాలేను: ఈడీకి రాహుల్‌ వినతి

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi

ఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణలో ఉన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. దర్యాప్తు సంస్థకు ఓ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకాలేనంటూ ఇవాళ ఆయన ఓ లేఖ రాశారు. తన తల్లి బాగోగులు చూసుకునేందుకు అనుమతించాలని, విచారణను పొడిగించాలని లేఖలో ఈడీని కోరారు రాహుల్‌ గాంధీ(51).

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో.. రాహుల్‌ గాంధీ పాత్రపై అనుమానాలు ఏమిటో ఈడీ ఇప్పటిదాకా స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ, మూడు రోజులు పాటు మాత్రం ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా ప్రశ్నల వర్షం కురిపించింది. మరోవైపు ఈ చర్యకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తోంది. అయితే ఈడీ విచారణకు గురువారం బ్రేక్‌ పడింది. తిరిగి శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలంటూ కోరింది ఈడీ.

తన తల్లి(సోనియా గాంధీ) కరోనాతో చికిత్స పొందుతున్నందున.. విచారణకు హాజరుకాలేనని, తన తల్లి బాగోగులు చూసుకోవడానికి కొన్ని రోజులు విచారణను పొడిగించాలని రాహుల్‌ లేఖలో కోరారు. అయితే ఆ విజ్ఞప్తిపై ఈడీ స్పందించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News