మోడీ వోటింగ్ మిషన్కు భయపడేది లేదు
బీహార్ ఎన్నికల ర్యాలీలో రాహుల్ వ్యాఖ్య
అరారియా(బీహార్):కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎలెక్ట్రానిక్ వోటింగ్ మిషన్(ఇవిఎం)ను మోడీ వోటింగ్ మిషన్ (ఎంవిఎం)గా బుధవారం అభివర్ణించారు. ఎంవిఎం అన్నా మోడీజీ మీడియా అన్నా తనకు భయం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధవారం ఒక ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ వాస్తవం వాస్తవమేనని, న్యాయం న్యాయమేనని, ఆ వ్యక్తి(ప్రధాని మోడీ)పై తాను సైద్ధాంతిక పోరాటం చేస్తున్నానని చెప్పారు. వారి భావజాలంపై తాము పోరాడుతున్నామని, వారి భావజాలాన్ని ఓడించి తీరతామని ఆయన తెలిపారు. మోడీ తన ప్రసంగాలలో నాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. నాపై ఎంత విద్వేషాన్ని వారు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించినప్పటికీ నేను మాత్రం ప్రేమను పంచిపెడతాను. ద్వేషాన్ని ద్వేషం ఓడించదు. ప్రేమ మాత్రమే ద్వేషాన్ని ఓడించగలదు. నరేంద్ర మోడీని ఓడించేవరకు ఒక్క అంగుళం కూడా నన్ను కదల్చలేరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఆయన మధేపురా ర్యాలీలో ప్రసంగించారు.
Rahul Gandhi slams PM Modi on EVM Voting