Monday, May 13, 2024

ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రం

- Advertisement -
- Advertisement -

Raja Raja Chora Movie Success Meet

శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. హిసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ ఆర్ట్ బ్యానర్‌లపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శ్రీవిష్ణు, హిసిత్ గోలి, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ “సినిమా సూపర్ హిట్ అయినందుకు ఆనందంగా ఉంది. హీరోయిన్లు మేఘా ఆకాష్, సునైన బాగా నటించారు. సినిమాలో ప్రతి పాత్ర అదిరిపోయింది. ఇలాంటి పాత్రలను సృష్టించిన దర్శకుడు హసిత్ గ్రేట్. చాలా రోజులు ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది”అని అన్నారు. చిత్ర దర్శకుడు హిసిత్ గోలి మాట్లాడుతూ “సినిమాకు ఇంత గొప్ప స్పందన వస్తుందని అనుకోలేదు. సినిమాకు థియేటర్లు పెరుగుతున్నాయి. నిర్మాతలు రిస్క్ చేసి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం గొప్ప విషయం. వారి నమ్మకం ఈరోజు నిజమైనందుకు హ్యాపీగా ఉంది”అని చెప్పారు.

Raja Raja Chora Movie Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News