ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఓ ప్రాజెక్ట్కు రాజమౌళి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే సినిమా అని తేల్చేశారు. ‘బాహుబలి’కి ముందు నిర్మాతలు డి.వి.వి.దానయ్య, కె.ఎల్. నారాయణలు రాజమౌళితో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారట. మహేష్ బాబు హీరోగా ఓ కౌబాయ్ సినిమా చేద్దామని నిర్మాత కె.ఎల్ నారాయణ అనుకున్నారట. కానీ మధ్యలో ‘బాహుబలి’ రావడం… 7 ఏళ్లు అలా గడిచిపోవడం జరిగిపోయాయి. ‘బాహుబలి’ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో రాజమౌళి దేశంలోనే టాప్ దర్శకుడిగా ఎదిగిపోయారు. ఆ తర్వాత రామ్చరణ్, ఎన్టీఆర్లతో ‘ఆర్ఆర్ఆర్’ మొదలుపెట్టేశారు. అయితే నిర్మాత కె.ఎల్. నారాయణతో సినిమా చేయడానికి రాజమౌళికి సమయం లేకుండాపోయింది. ఇక నిర్మాత డి.వి.వి. దానయ్యతో ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ తీస్తున్నారు. రామ్చరణ్, -ఎన్టీఆర్లతో కలిసి ఈ భారీ మల్టీస్టారర్ సినిమాను తెరెక్కిస్తున్నారు.
ఇప్పుడీ మల్టీస్టారర్ ముగిశాక మహేశ్ బాబుతో సినిమా చేయడానికి జక్కన్న ప్లాన్ చేసినట్టు సమాచారం. వచ్చే ఏడాది మహేష్ బాబుతో సినిమా చేసేలా నిర్మాత కె.ఎల్. నారాయణ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇంతకీ మరి మహేష్ ఎలాంటి జోనర్లో.. ఏ కథతో రాజమౌళి సినిమా తీస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదివరకే కౌబాయ్ కథ అని ఒకసారి.. కాదు జేమ్స్ బాండ్ టైప్ సినిమా కథ అని ప్రచారం సాగింది. రాజమౌళి సైతం జేమ్స్బాండ్ లాంటి కథ అయితేనే మహేష్ బాబుకు సరిపోతుందని అన్నారు. తాజాగా రాజమౌళి ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. అయితే మహేష్ బాబుతో సినిమా గురించి ఇప్పుడే ఏ కథ అనుకోలేదని.. తాము ఏమీ చర్చించుకోలేదని రాజమౌళి తెలిపారు. మహేష్ బాబు ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్తోపాటు నా అభిరుచికి తగ్గట్టుగా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నాక తన తదుపరి సినిమా మొదలుపెడుతానని రాజమౌళి చెప్పారు. మహేష్ బాబుతో ఇంకా కథ గురించి చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు.